**కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తి బీజేపీయే: గోగుల రాణా ప్రతాప్ రెడ్డి**
రాష్ట్రంలో మరియు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయ శక్తి బీజేపీయేనని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు.ముచ్చింపుల గ్రామంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ అధ్యక్షతన, గ్రామ పార్టీ అధ్యక్షులు ధర్మారం క్రాంతికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో, రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో పలువురు ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరారు.
BRS పార్టీ నుండి మండల సీనియర్ నాయకులు కక్కెర్ల సురేష్, కొత్తపెల్లి మధుకర్, శీలం ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ నుండి నాయకులు నడిగొట్టు దర్మేందర్. బీజేపీ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి రాణా ప్రతాప్ రెడ్డి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
### **రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య వ్యాఖ్యలు:**
> “గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చాయి. ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రజలను వంచించాయి. నియోజకవర్గంలో బీజేపీ పటిష్టమైన నాయకత్వం పట్ల నమ్మకంతోనే ఇతర పార్టీల సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరుతున్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు బత్తిని కుమారస్వామి గౌడ్, సింగిరెడ్డి యాదగిరి, మండల నాయకులు వల్లే పర్వాతలు, కక్కెర్ల సమయ్య, బత్తిని మల్లికార్జున్, ములుక రాజేష్, మార్తా రవీందర్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
