PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 4:43 pm Posted by : PEOPLES DAIRY NEWS

బుచ్చిరెడ్డిపల్లిలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లి గ్రామంలో నూతన అంగన్‌వాడీ భవన నిర్మాణానికి నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఘనంగా శంకుస్థాపన చేశారు. రూ. 12 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ భవనానికి ఆయన భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.గ్రామంలోని చిన్న పిల్లలకు, గర్భిణీలకు మెరుగైన సేవలు అందించేందుకు మరియు అంగన్‌వాడీ కేంద్రం మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటు నర్సంపేట నియోజకవర్గ, మండల మరియు గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు