PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 9:22 am Posted by : PEOPLES DAIRY NEWS

రంగాపురం గ్రామపంచాయతీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రంగాపురం గ్రామపంచాయతీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగాపురం గ్రామపంచాయతీ ఆవరణంలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్  ఓరుగంటి మాధురి రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన అమర వీరులను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి పౌరుడు బాధ్యతగా ముందుకు రావాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనం పరిరక్షణ మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కస్తూరోజు రామ్మూర్తి, వార్డ్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి రామారావు గారు, గ్రామపంచాయతీ సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, యువకులు, మహిళలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.దేశభక్తి నినాదాలతో గ్రామపంచాయతీ కార్యాలయ పరిసరాలు మార్మోగగా వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.