వరంగల్ నగరంలో భారీ జాతీయ జెండా కి అవమానం
పీపుల్స్ డైరీ వరంగల్ : వవరంగల్ మున్సిపల్ పరిధిలో పోతన నగర్ భద్రకాళి బండ్ ప్రాంతంలోని బారీ ఎత్తున ఉన్న జాతీయ జెండాను ప్రస్తుతం పట్టించుకునే అధికారులు నిద్రావస్థలో ఉన్నట్టు గత కొన్ని రోజులుగా చిరిగిన జాతీయ జెండా ఎగురుతున్నప్పటికీ కంటికి కానరానట్టు వ్యవహరిస్తున్నారు అటుగా పదుల సంఖ్యలో అధికారులు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు అయినప్పటికీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారా లేదా నిర్లక్యం వహిస్తున్నారా అని వాదనలు వినపడుతున్నాయి భారత జాతీయ పతాకం ( త్రివర్ణ పతాకం ) అనేది దేశానికి అత్యున్నత గౌరవ చిహ్నం చిరిగిన జెండాను ఎగరవేయడం చట్టరీత్యా నేరం జెండాను అవమానించినట్టే నిబంధనల ప్రకారం చినిగిన జాతీయ జెండాను దహనం చేయాలి లేదా పాతి పెట్టవలసి వస్తుంది జెండా పవిత్రతకు భంగం కలగకుండా చూడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పవిత్ర జాతీయ పతాకాన్ని మార్చి గౌరవాన్ని కాపాడాలని ప్రజలు వేడుకుంటున్నారు.
