న్యూ అంబేద్కర్ నగర్ కాలనీ నూతన అధ్యక్షుడిగా దేశపాక నరసింహ ఎన్నిక

కాంగ్రెస్ నాయకులను
మర్యాదపూర్వకంగా కలిసిన నూతన కమిటీ సభ్యులు
నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన నేతలు
బోడుప్పల్:(పీపుల్స్ డైరీ): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్,10 డివిజన్ బోడుప్పల్లోని న్యూ అంబేద్కర్ నగర్ కాలనీ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పడిన నేపథ్యంలో అధ్యక్షుడు దేశపాక నర్సింహ,ప్రధాన కార్యదర్శి మాల్యాల సోమరాజు,మాజీ అధ్యక్షులు దూడల విష్ణు గౌడ్,పర్వతాలు, వెంకటేష్,నాగరాజు,వంగాల నర్సింహ గౌడ్,చింతిగారి నాగరాజు,అంబాల గిరి గౌడ్,దేశపాక వినోద్ తదితరులు బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ బొమ్మక్ కళ్యాణ్ కుమార్,మాజీ అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ పోగుల నరసింహారెడ్డి,మేడ్చల్ జిల్లా బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు దానగళ్ల యాదగిరి,మాజీ కార్పొరేటర్ చీరాల నరసింహ తదితరులను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు నూతన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించి,కాలనీ అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అందర్నీ కలుపుకొని కృషి చేయాలని సూచిస్తూ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో
కాలనీ అసోసియేషన్ సభ్యులు శ్రీకాంత్,యాదగిరి చారి, టీవి నాగరాజు,పి యాకయ్య,యాకయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.
