ePaper
Saturday, July 11, 2026
ePaper
Home Blog

రేపు నల్లబెల్లి పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత

0

రేపు నల్లబెల్లి పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత

నల్లబెల్లి, జూలై 10:

రేపు శనివారం నల్లబెల్లి మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని విద్యుత్ శాఖ ఇంచార్జి అసిస్టెంట్ ఇంజనీర్ (AE) మధుకర్ ఒక ప్రకటనలో తెలిపారు.11/07/2026 (రెండవ శనివారం) సబ్ స్టేషన్‌లో అత్యవసర నిర్వహణ మరియు మరమ్మత్తు పనులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 11:30 గంటల వరకు సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని వివరించారు.విద్యుత్ వినియోగదారులు ఈ సమయాన్ని గమనించి, పనులకు అంతరాయం కలగకుండా ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని మరియు అధికారులకు సహకరించవలసిందిగా కోరారు.

తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు అండగా ‘జనతా ట్రస్ట్’

0

తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు అండగా ‘జనతా ట్రస్ట్’
రూ. 10,000 ఆర్థిక సాయం అందించిన ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

చెన్నారావుపేట, జూలై 10:

తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు తామున్నామంటూ జనతా ట్రస్ట్ మానవత్వాన్ని చాటుకుంది. నర్సంపేట నియోజకవర్గం, చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట గ్రామానికి చెందిన బుడిగే శిరీష – రవికుమార్ దంపతులు కొన్ని రోజుల క్రితం ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ విషాద ఘటనతో తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయిన బాధిత కుటుంబాన్ని జనతా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులతో కలిసి శుక్రవారం పరామర్శించారు. తల్లిదండ్రులు లేని లోటుతో కుమిలిపోతున్న ఆ దంపతుల కుమారులైన సుశాంత్, విద్వాన్ష్‌లను ఆయన ఓదార్చారు. వారికి మనోధైర్యాన్ని చెబుతూ, భవిష్యత్తులో ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పిల్లల తక్షణ ఖర్చుల నిమిత్తం ట్రస్ట్ తరఫున రూ. 10,000/- (పది వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు.”తల్లిదండ్రులను కోల్పోయిన ఆ పిల్లల పరిస్థితి అత్యంత హృదయవిదారకం. ఇలాంటి కష్టసమయంలో వారిని ఆదుకోవడం మనందరి బాధ్యత. జనతా ట్రస్ట్ ఎల్లప్పుడూ వీరికి తోడుగా ఉంటుంది.”ఈ కార్యక్రమంలో జనతా ట్రస్ట్ ప్రతినిధులు, స్థానిక నాయకులు దుంకదువ్వ రంజిత్, గూడూరు సందీప్, మురహరి విజయ్, అచ్చ దయాకర్, బానోత్ రమేష్, విజయ్ సింగ్, మరాఠి ఉప్పలయ్య, మేడి సంతోష్, కందల చంద్రమౌళి, మేడి వంశీ కృష్ణ, బండి రాజ్ కుమార్, పాల్తీయ శశీందర్, నరేష్, సుమన్, నవీన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు

నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సేవలకు ముగింపు.. నల్లబెల్లి వీఆర్ఏ కొమరమ్మ మృతి

0

నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సేవలకు ముగింపు.. నల్లబెల్లి వీఆర్ఏ కొమరమ్మ మృతి

నల్లబెల్లి మండల కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. గత నాలుగు దశాబ్దాలుగా నిస్వార్థంగా సేవలందించిన ఒక నిబద్ధత గల ఉద్యోగినిని ఆ ప్రాంతం కోల్పోయింది. మండల కేంద్రంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (VRA)గా విధులు నిర్వహిస్తున్న కీసరి కొమరమ్మ ఈరోజు ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు.కొమరమ్మ గత 40 సంవత్సరాలుగా రెవెన్యూ శాఖలో సేవకురాలిగా, వీఆర్ఏగా తన విధులను నిర్వర్తించారు.నల్లబెల్లి మండల పరిధిలోని ప్రజలకు, రెవెన్యూ అధికారులకు మధ్య ఆమె ఒక బలమైన వారధిగా నిలిచారు.నాలుగు దశాబ్దాల పాటు ఎంతో మంది అధికారుల వద్ద పని చేస్తూ, విధుల్లో ఎలాంటి మచ్చ లేకుండా బాధ్యతలు నిర్వహించారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.కొమరమ్మ మరణవార్త తెలియగానే నల్లబెల్లి మండల కేంద్రంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆమె సుదీర్ఘ కాలం పాటు స్థానిక ప్రజలతో మమేకం అవ్వడం వల్ల, ప్రతి ఒక్కరూ ఆమెను తమ కుటుంబ సభ్యురాలిగా భావించారు. ఆమె మృతి పట్ల స్థానిక రెవెన్యూ అధికారులు, తోటి వీఆర్ఏలు మరియు గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.కొమరమ్మ మరణం నల్లబెల్లి రెవెన్యూ రంగానికి మరియు స్థానిక ప్రజలకు తీరని లోటు. ఆమె అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.” అని తోటి సిబ్బంది సంతాపం తెలిపారు.ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు స్థానిక నేతలు, అధికారులు తమ గాఢ సానుభూతిని తెలియజేశారు.

 

కార్మికులుండగానే బాంబ్ బ్లాస్టింగ్..!

0

కార్మికులుండగానే బాంబ్ బ్లాస్టింగ్..!

– ఓసీ త్రీ గనిలో తప్పిన ప్రమాదం

– హెచ్చరిక లేకుండానే బ్లాస్టింగ్..!

– అధికారుల నిర్లక్ష్యం వల్లేనా…? 

– అధికారుల తీరుపై ఆగ్రహం.. గని వద్ద ధర్నా

– ‘విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం’: ఇన్‌చార్జి మేనేజర్

గణపురం, జూలై 9 (పీపుల్స్ డైరీ):

గణపురం మండలంలోని ఓసీ- త్రీ ఓపెన్‌కాస్ట్ గనిలో కార్మికులు సమీపంలో ఉండగానే బాంబ్ బ్లాస్టింగ్ జరగడం తీవ్ర కలకలం రేపింది. క్షణాల్లో పెను ప్రమాదం తప్పడంతో కార్మికులు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడి గని వద్దే ధర్నాకు దిగారు. ఈ ఘటనతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత కార్మికుల వివరాల ప్రకారం.. ఓసీ త్రీలో మొత్తం 82 మంది కార్మికులు ఉండగా, ప్రస్తుతం 56 మందికే విధులు కల్పిస్తున్నారని, మిగిలిన 26 మందికి కూడా ఉపాధి కల్పించాలని వారు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి సింగరేణి జనరల్ మేనేజర్‌కు వారం రోజుల గడువు ఇచ్చినట్లు తెలిపారు. గడువు ముగియడంతో గురువారం కార్మికులు గని వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. ఈ సమయంలో అధికారులు ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే ప్రత్యామ్నాయ కార్మికులతో బ్లాస్టింగ్ నిర్వహించారని కార్మికులు ఆరోపించారు. బ్లాస్టింగ్ జరిగే సమయంలో భద్రతా నిబంధనల ప్రకారం కనీసం 500 మీటర్ల దూరంలో ఉండాల్సి ఉన్నప్పటికీ, తాము అత్యంత సమీపంలో ఉండగానే పేలుళ్లు జరగడంతో ప్రాణభయంతో పరుగులు తీశామని తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా, క్షణాల్లో భారీ ప్రమాదం తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్‌ను కావాలనే నిర్వహించారని ఆరోపిస్తూ కార్మికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం గని వద్దే ధర్నా నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఓసీ త్రీ ఇన్‌చార్జి మేనేజర్ శ్యాంసుందర్ స్పందిస్తూ, కార్మికులు సమీపంలో ఉండగా బ్లాస్టింగ్ జరగడం తప్పేనని అంగీకరించారు. ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

 

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులే ప్రభుత్వ లక్ష్యం

0

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులే ప్రభుత్వ లక్ష్యం

– ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 

– గణపురంలో రూ. 2.70 కోట్లతో సీసీ రోడ్ల ప్రారంభం

గణపురం, జూలై 9 (పీపుల్స్ డైరీ):

గణపురం మండలంలోని పలు గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గురువారం ప్రారంభించారు. సుమారు రూ.2.70 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేశారు. మైలారంలో రూ.9 లక్షలు, గాంధీనగర్‌లో రూ.35.80 లక్షలు, కర్కపల్లిలో రూ.12 లక్షలు, లక్ష్మారెడ్డిపల్లిలో రూ.25 లక్షలు, బుర్రకాయలగూడెంలో రూ.10 లక్షలు, గణపురం మండల కేంద్రంలో రూ.29 లక్షలు, ధర్మారావుపేటలో రూ.10 లక్షలు, అప్పయ్యపల్లి మండల పరిషత్ పాఠశాలలో రూ.10 లక్షలు, సీతారాంపురంలో రూ.12.80 లక్షలు, బుద్ధారంలో రూ.16.50 లక్షలు, చెల్పూర్‌లో రూ.75 లక్షలు, బసవరాజుపల్లిలో రూ.25.50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. నాణ్యమైన సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ పనులు పూర్తికావడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అడ్లూరి రాజేశ్వర రావు, ఎంపీడీవో భాస్కర్, ఎంపీవో శ్రీకాంత్, సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్, సర్పంచ్ లు కటుకూరి రాధిక శ్రీనివాస్, సంపత్ రెడ్డి, ఇంజపెల్లి శ్రీనివాస్, భూక్య సమ్మయ్య, విడిదినేని శ్రీలత అశోక్, తోట రాకేష్, ఎలుకపెళ్లి రమేష్, పూజరి రాజేందర్, చింతకుంట్ల సునీత శ్రీనివాస్, కావటి రజిత రవీందర్, ఉప సర్పంచ్ లు పొనగంటి మలహాల్ రావు, కనిపర్తి వినయ్ కుమార్, మాజీ సొసైటీ చైర్మన్ తాళ్లపెళ్లి భాస్కర్ రావు, నాయకులు కొత్త వెంకన్న, లక్కం రాములు సూరినేని సంపత్ రావు, మార్నేని ఉపేందర్ రావు, పంచమనేని తిరుమల్ రావు, బొల్లెడ్ల ప్రభాకర్ రెడ్డి, కాంతాల సమ్మిరెడ్డి, కాల్వ రాంరెడ్డి, ఓద్దుల అశోక్ రెడ్డి, చోటే మియా, పెంట చిరంజీవి ఇమ్మడి వెంకటేశ్వర్లు, పిడిశెట్టి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

మహిళా న్యాయవాదిపై దాడి..

0
  1. మహిళా న్యాయవాదిపై దాడి..

నిందితులు ఇంకా బయటే
న్యాయం కోసం న్యాయవాది పోరాటం

హైకోర్టు ఆదేశాలు ఉన్నా కదలని పోలీసులు..?

బోడుప్పల్:(పీపుల్స్ డైరీ):మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నారపల్లిలోని ఓ మహిళా న్యాయవాది కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,న్యాయస్థానాలు జారీ చేసిన ఉత్తర్వులను సైతం అమలు చేయడం లేదని బాధిత న్యాయవాది మల్లుల శిరీష తీవ్ర ఆరోపణలు చేశారు. నిందితులపై ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.బాధితురాలి కథనం ప్రకారం అలేటి మోహన్ రెడ్డి,వెంకటేష్ నా రోజి,ప్రవీణ్ నారోజి,ప్రవీణ్ భార్య,తల్లి,మేఘనాథ్ తదితరులు తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.ఈ వ్యక్తులపై సీనియర్ సివిల్ జడ్జి తనకు అనుకూలంగా మధ్యంతర నిషేధాజ్ఞ (ఇంటరిమ్ ఇంజంక్షన్) జారీ చేసినప్పటికీ,పోలీసులు దానిని పట్టించుకోలేదని పేర్కొన్నారు.దాడి సమయంలో తన క్లయింట్లకు సంబంధించిన కీలకమైన కేసు ఫైళ్లు,పత్రాలు ఇతర ముఖ్యమైన మెటీరియల్‌ను నిందితులు బలవంతంగా తీసుకెళ్లారని ఆమె ఆరోపించారు.ప్రస్తుతం ఆమెటీరియల్ నిందితులవద్దే ఉన్నప్పటికీ,వాటిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు.ఈ వ్యవహారంపై హైకోర్టుకూడా నిందితుల వద్ద ఉన్న మెటీరియల్‌ను తిరిగి స్వాధీనం చేసుకొని బాధితురాలికి రక్షణ కల్పించాలని సూచించినప్పటికీ స్థానిక పోలీసులు ఆ ఉత్తర్వులను అమలు చేయడం లేదని ఆరోపించారు.అంతేకాక దొంగతనం అక్రమ ప్రవేశానికి సంబంధించిన తీవ్ర ఆరోపణలున్న ఘటనను పోలీసులు కేవలం సాధారణ క్రిమినల్ ఫిర్యాదుగా నమోదు చేసి కంటితుడుపు చర్యలకే పరిమితమయ్యారని విమర్శించారు.ఈ కేసులో దర్యాప్తు పక్షపాతంగా సాగుతోందని ప్రభావశీల వ్యక్తులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.ఒక మహిళా న్యాయవాదిపైనే కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ న్యాయం జరగకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని బాధితురాలు ప్రశ్నించారు.న్యాయస్థానాల ఆదేశాలను వెంటనే అమలు చేసి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తనకు తన కుటుంబానికి భద్రత కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులను కోరారు.కొందరు సహచర న్యాయవాదులు ఆమెకు మద్దతుగా నిలిచారు.

మేడ్చల్ మండల విద్యాశాఖ కార్యాలయంలో ఘనంగా వన మహోత్సవం*

0

*మేడ్చల్ మండల విద్యాశాఖ కార్యాలయంలో ఘనంగా వన మహోత్సవం*

మేడ్చల్, జూలై 8: పీవీ పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి మేడ్చల్ మండల విద్యాశాఖ కార్యాలయం ఆవరణంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శంకర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీవీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామేశ్వరరావు, ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

*మేడ్చల్ మండల విద్యాశాఖ కార్యాలయంలో ఘనంగా వన మహోత్సవం.

0

*మేడ్చల్ మండల విద్యాశాఖ కార్యాలయంలో ఘనంగా వన మహోత్సవం* మేడ్చల్, జూలై 8: పీవీ పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి మేడ్చల్ మండల విద్యాశాఖ కార్యాలయం ఆవరణంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శంకర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీవీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామేశ్వరరావు, ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి మండల ఆప్ అధ్యక్షుడిగా జాడి నితిన్ నియామకం

0

పీపుల్స్ డైరీ,భూపాలపల్లి:  ఆమ్ ఆద్మీ పార్టీ భూపాలపల్లి మండల అధ్యక్షుడిగా జాడి నితిన్‌ను నియమిస్తూ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ అధికారిక నియామక పత్రాన్ని విడుదల చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా నాగుల అరవింద్ మాట్లాడుతూ..జాడి నితిన్ గత నాలుగేళ్లుగా పార్టీ పట్టణ అధ్యక్షుడిగా పనిచేస్తూ జిల్లాలో పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తించి మండల అధ్యక్షుడి బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు.భూపాలపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీ విస్తరణకు కృషి చేయడంతో పాటు ప్రజా సమస్యలపై పోరాడాలని, రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలను సమన్వయం చేస్తూ పనిచేయాలని సూచించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడిగా నియమితులైన జాడి నితిన్‌కు జిల్లా, రాష్ట్ర నాయకత్వం శుభాకాంక్షలు తెలిపింది.

 

పవిత్ర ఆలయంలో పొలిటికల్ స్టంట్లు.

0

పవిత్ర ఆలయంలో పొలిటికల్ స్టంట్లు

కూడా ప్లాటింగ్ లో అవకతవకలంటూ ఒకరు

ఎటువంటి దోపిడీ అక్రమాలు జరగలేదంటూ మరొకరు

ఆలయం అపవిత్రమైందని పవిత్రం చేయటానికి మరొకరు

పవిత్రాపవిత్రాలు రాజకీయ ఆలయాల చుట్టూ చేయాలి

ఆటంకాలు కలిగిస్తూ పార్టీలను అభాసు పాలు చేస్తున్నారంటూ భక్తులు

ఆలయ పరిసరాల్లో క్షుద్ర పూజలు, ఆలయంలో కరెంట్ కట్…కారణం..?

సంఘటనలు జరుగుతుంటే చోద్యం చూస్తున్న ఆలయ అధికారులు

పీపుల్స్ డైరీ ప్రతినిధి వరంగల్

  • ఓరుగల్లు చరిత్రగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో పలు రాజకీయ పార్టీ వర్గాలు స్టంట్లు చేశాయి గత ప్రభుత్వంలో కూడా ప్లాట్ల విషయంలో అవకతవకలు జరిగాయంటూ నింద వేస్తే తప్పు చేయలేదంటూ నిరూపించుకుంటానని ఉదయాన్నే తడిచిన బట్టలతో ఆలయంలో ప్రమాణం చేస్తూ ఒకరు పొరపాట్లు దొర్లాయంటూ మరొకరు భద్రకాళి ఆలయం ఇలా అపవిత్రం చేస్తారా అంటూ పవిత్రం చేయటానికి మరొకరు ఈ అనాలోచిత సంఘటన అటు పార్టీ వర్గాల్లో ఇటు భక్తుల నడుమ హాట్ టాపిక్ గా మారింది ఏదైనా తేల్చుకుంటే బాహాటంగా తేల్చుకోవాలి కానీ ఇలా భద్రకాళి ఆలయానికి దర్శనానికి వచ్చే భక్తులకు ఆటంకాలు కలిగిస్తూ పార్టీ పరువు బజారు పాలు చేస్తున్నారని భక్తులు వాపోతున్నారు ఇక ముందు రోజు రాత్రి భద్రకాళి ఆలయ పరిసర ప్రాంతాల్లో క్షుద్ర పూజలంటూ ప్రచారం రాత్రి సమయంలో దాదాపు గంటల కొద్ది విద్యుత్ లేకపోవటం ఇదంతా చూస్తుంటే భక్తుల్లో ఏదో తెలియని ఆందోళన వ్యక్తం ఏర్పడింది ఇలాంటి దుశ్చర్యల వలనే ఎన్నడూ లేని విధంగా జరిగిన సంఘటనల పై పలు అనుమానాలు సైతం వ్యక్తం చేయాల్సి వస్తుంది ఇదిలా ఉండగా ఇంత రాద్దాంతం జరుగుతుంటే చేతులు కట్టుకుని చోద్యం చూస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు
error: Content is protected !!