ePaper
Sunday, July 12, 2026
ePaper
Homeఎడిటోరియల్రేలకుంటలో కాకతీయ, శ్రీ చైతన్య గ్రామైక్య మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి...

రేలకుంటలో కాకతీయ, శ్రీ చైతన్య గ్రామైక్య మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

📰 Generate e-Paper Clip

నల్లబెల్లి మండలం రేలకుంట గ్రామంలో కాకతీయ, శ్రీ చైతన్య గ్రామైక్య మహిళా సంఘం (VO) నూతన భవన నిర్మాణానికి నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఘనంగా శంకుస్థాపన చేశారు. రూ. 10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ భవనానికి ఆయన భూమిపూజ చేసి, పనులను ప్రారంభించారు.

గ్రామాల్లోని మహిళా సంఘాల బలోపేతానికి, మహిళలు ఒకచోట చేరి తమ ఆర్థిక ప్రణాళికలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి ఈ సొంత భవనం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ, మండల మరియు గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు స్థానిక మహిళలు, ఐకేపీ (IKP) సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!