గాంధీనగర్ గ్రామ పేదలకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ: లక్ష్మీస్ అమ్మ ఫౌండేషన్, జెన్కో కానిస్టేబుల్స్ ఉదారత
*పీపుల్స్ డైరీ*భూపాలపల్లి (గాంధీనగర్):**
కష్టాల్లో ఉండి సహాయం కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలను ఆదుకోవడం అభినందనీయమని గాంధీనగర్ గ్రామ సర్పంచ్ ఇంజపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం గాంధీనగర్ గ్రామంలో పేదరికంలో మగ్గుతున్న తూముల భూమామ్మ, సెగ్గం వెంకటేష్ అనే లబ్ధిదారులకు **HELP TO NEEDY** గ్రూప్ (తెలంగాణ జెన్కో కానిస్టేబుల్స్ ఆధ్వర్యంలో) మరియు **లక్ష్మీస్ అమ్మ ఫౌండేషన్ (Laxmi’s AMMA FOUNDATION)** సంయుక్తంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశాయి.గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు ఒక రేషన్ కిట్ (Ration Kit) తో పాటు, లక్ష్మీస్ అమ్మ ఫౌండేషన్ తరఫున 25 కిలోల బియ్యం బస్తాను అందజేశారు.
111 మందికి పైగా అండగా…
గత కొన్ని సంవత్సరాలుగా భూపాలపల్లి ప్రాంతంలో సరైన వసతులు లేక, సహాయం కోసం ఎదురుచూస్తున్న దాదాపు 111 మంది నిరుపేదలను లక్ష్మీస్ అమ్మ ఫౌండేషన్ గుర్తించి, వారికి నిరంతరం అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.పేదరికంలో ఉన్నవారిని గుర్తించి సకాలంలో స్పందించి సహాయం చేయడం గొప్ప విషయం. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని గ్రామ సర్పంచ్ ఇంజపల్లి శ్రీనివాస్ తెలిపారు..ఈ పంపిణీ కార్యక్రమంలో లక్ష్మీస్ అమ్మ ఫౌండేషన్ నిర్వాహకులు చింతనిప్పుల వెంకన్న, గ్రామ సర్పంచ్ ఇంజపల్లి శ్రీనివాస్, సెగ్గం శ్రీనివాస్, తెలంగాణ జెన్కో కానిస్టేబుల్స్ మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
