ఆస్తి నేరాల నివారణపై ప్రజలకు అవగాహన
ఏన్కూరు (పీపుల్స్ డైరీ) : ఇటీవల కాలంలో గృహ చోరీలు, రాత్రివేళ దొంగతనాలు మరియు ఇతర ఆస్తి సంబంధిత నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కల్లూరు డివిజన్ పోలీసు శాఖ ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు జారీ చేస్తోంది. ప్రతి పౌరుడు తమ ఇల్లు, కుటుంబం మరియు విలువైన ఆస్తుల రక్షణ కోసం క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మరియు రాత్రి నిద్రించే ముందు తలుపులు, కిటికీలు సక్రమంగా తాళం వేసి ఉన్నాయో నిర్ధారించుకోవాలి.
ఇంట్లో అధిక మొత్తంలో నగదు, బంగారం మరియు ఇతర విలువైన వస్తువులు నిల్వ ఉంచకుండా బ్యాంకు లాకర్లను వినియోగించాలి.
ఇంటి పరిసరాల్లో తగిన వెలుతురు ఉండేలా చూడాలి.
బలమైన తాళాలు, సెక్యూరిటీ డోర్లు మరియు ఇతర భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి.
అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించిన వెంటనే సమీప పోలీసు స్టేషన్కు సమాచారం అందించాలి.
ఇళ్లు, వ్యాపార సంస్థలు మరియు ఇతర ముఖ్య ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
బయట ప్రాంతాలకు వెళ్లే సమయంలో పొరుగువారికి లేదా బంధువులకు సమాచారం ఇవ్వాలి.
కల్లూరు డివిజన్ పోలీసుల చర్యలు: ఆస్తి నేరాల నివారణ మరియు గుర్తింపును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ క్రింది చర్యలను చేపడుతోంది:
* రాత్రి వేళల్లో ప్రత్యేక నైట్ పెట్రోలింగ్.
* గ్రామాలు, కాలనీలు మరియు ప్రధాన రహదారులపై మొబైల్ పెట్రోలింగ్.
* నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా.
* సీసీటీవీ ఫుటేజ్ విశ్లేషణ మరియు సాంకేతిక ఆధారాల సేకరణ.
* నేర ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు.
ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడం సాధ్యమవుతుంది. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా కార్యకలాపాల గురించి వెంటనే సమీప పోలీసు స్టేషన్కు లేదా డయల్-100 కు సమాచారం అందించాలని కల్లూరు ఏసిపి వసుంధర యాదవ్ కోరారు.
