- రెండు రోజుల్లో తండ్రి, కొడుకు మృతి.
- రూపిరెడ్డి పల్లి గ్రామంలో తీవ్ర విషాదం..
రేగొండ మే 28 పీపుల్స్ డైరీ..
అనారోగ్యంతో బాధపడుతూ మృత్యువుతో పోరాడి తండ్రి చెందగా రెండవ రోజు కరెంట్ షాక్ తో కొడుకు మృతి చెందిన విషాద సంఘటన రూపిరెడ్డి పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రేగొండ మండలం రూపిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కనుకుంట్ల సమ్మయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతు ఈనెల 26 మంగళవారం రోజు మృతి చెందాడు. కాగా శుక్రవారం రోజు మృతుడు సమ్మయ్య దిన చర్యలో భాగంగా దినం ముట్టించేందు కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో మృతుడు సమ్మయ్య కొడుకు కనుకుంట్ల గోపి( 46) ఇంటిముందు మోటార్ వేసి నీళ్లు పడుతున్న క్రమంలో ఇంటి ముందు రేకులకు అనుకోని ఉన్న విద్యుత్ వైరు తగిలి షాక్ కు గురయ్యడు గోపిని కాపాడడానికి వెళ్లిన గోపి అక్కకి కూడా షాక్ తగిలి అడ్డం పడిపోయారు. కాగా ఇద్దరినీ పరకాల ప్రభుత్వ హాస్పటల్ తరలించే సరికి గోపి మృతి చెందాడు. రాక్షంచడానికి వెళ్లిన మృతుడు గోపి అక్కకు ప్రమాదం తప్పి చికిత్స పొందుతునంది.కాగా గోపి మృతికి గల కారణాలు తెలుసుకొని మృతుని భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రేగొండ పోలీసులు తెలిపారు.రెండు రోజుల వ్యవదిలో తండ్రి కొడుకు మృతి చెందడంతో రూపిరెడ్డి పల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
