ePaper
Saturday, July 11, 2026
ePaper
Homeతెలంగాణమెట్రో తర్వాత మరో సంచలనం...

మెట్రో తర్వాత మరో సంచలనం…

📰 Generate e-Paper Clip

  • హైదరాబాద్​ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పు!
  • ఇక ఆకాశ మార్గంలో దూసుకెళ్లడమే….
  • మారనున్న హైదరాబాద్​ ముఖచిత్రం
  • రాజధానిలో రోప్​వేల నిర్మాణంపై సన్నాహాలు
  • ఇక ట్రాఫిక్​ కష్టాలు ఉండవు…

పీపుల్స్​డైరీ – హైదరాబాద్​ :
హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు, భాగ్యనగర వాసులకు త్వరలోనే ఆకాశ మార్గంలో ప్రయాణించే అవకాశం కలగనుంది. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ నగరంలో రోప్‌వే ప్రాజెక్టులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు పర్వత ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన రోప్‌వేలను ఇప్పుడు నగర రవాణాలో భాగంగా వినియోగించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం విశేషం. ఇందుకోసం దేశంలోనే తొలి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రోప్‌వేగా గుర్తింపు పొందిన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి మోడల్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నారు.

ఈ ప్రాజెక్టులో తొలి దశగా గోల్కొండ కోట నుంచి కుతుబ్ షాహీ టూంబ్స్ వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర రోప్‌వే ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అనంతరం దీనిని నెహ్రూ జూలాజికల్ పార్క్ వరకు పొడిగించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం 6 కిలోమీటర్ల మేర ప్రయాణికులకు అద్భుతమైన ఏరియల్ వ్యూ అనుభూతిని అందించనుంది. అంతేకాకుండా ట్యాంక్‌బండ్ నుంచి సంజీవయ్య పార్క్ వరకు, అలాగే ఐటీ కారిడార్లలో ట్రాఫిక్ అధికంగా ఉండే ప్రాంతాల్లో కూడా రోప్‌వేలను ప్రవేశపెట్టే అవకాశాలను అధ్యయనం చేస్తున్నారు. మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్ల నుంచి సమీప వాణిజ్య సముదాయాలకు లాస్ట్ మైల్ కనెక్టివిటీగా ఇవి ఎంతో ఉపయోగపడనున్నాయి.

ఈ ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (PPP) పద్ధతిలో అమలు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడకుండా ఉంటుంది. అయితే ప్రైవేటు ఆస్తుల మీదుగా రోప్‌వే మార్గాలు వెళ్లే సందర్భంలో పరిహారం అంశాలపై పాలసీలో మార్పులు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI), రక్షణ శాఖల నుంచి అనుమతులు పొందేందుకు ప్రక్రియ కొనసాగుతోంది. అన్ని అనుమతులు లభిస్తే హైదరాబాద్‌లో త్వరలోనే స్కై ట్రాన్స్‌పోర్ట్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

వారణాసిలో గంటసేపు పట్టే ప్రయాణాన్ని కేవలం 16 నిమిషాల్లో పూర్తి చేసేలా రోప్‌వే వ్యవస్థను రూపొందించారు. అదే తరహాలో హైదరాబాద్‌లో కూడా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకంగా వర్షాకాలంలో నగర ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలకు రోప్‌వేలు శాశ్వత పరిష్కారంగా మారనున్నాయని భావిస్తున్నారు. టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా నిర్ణయించి, అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తే హైదరాబాద్ రవాణా రంగంలో ఇది చారిత్రాత్మక మార్పుకు నాంది కానుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!