ePaper
Saturday, July 11, 2026
ePaper
Home Blog Page 4

దుగ్గొండిలో ఉపాధి హామీ కూలీలకు అల్పాహారం పంపిణీ*

0

దుగ్గొండిలో ఉపాధి హామీ కూలీలకు అల్పాహారం పంపిణీ*

*దుగ్గొండి:*

దుగ్గొండి గ్రామ పరిధిలో ఉపాధి హామీ పనులకు వస్తున్న కూలీలకు మంగళవారం ఉదయం అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, కూలీల సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దుగ్గొండి గ్రామ సర్పంచ్ *శ్రీ కామిశెట్టి ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ వాజిద్ పాల్గొని కూలీలకు స్వయంగా అల్పాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ కూలీల సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని, ఎండలు ఎక్కువగా ఉన్నందున కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ (FA), మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

శనిగరం శివారులో 700 ఏళ్ల నాటి చారిత్రక శివాలయం పునరుద్ధరణ పనులు ప్రారంభం

0

శనిగరం శివారులో 700 ఏళ్ల నాటి చారిత్రక శివాలయం పునరుద్ధరణ పనులు ప్రారంభం

నల్లబెల్లి: పీపుల్స్ డైరీ

నల్లబెల్లి మండలంలోని శనివారం గ్రామ శివారులో ఉన్న సుమారు 700 సంవత్సరాల నాటి పురాతన శివాలయానికి మంగళవారం మరమ్మతు పనులు చేపట్టారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ చారిత్రక దేవాలయాన్ని పునరుద్ధరించేందుకు గ్రామ సర్పంచ్ ఉటుకూరి అశోక్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, పురోహితులు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజల సంపూర్ణ సహకారంతో ఈ పునరుద్ధరణ పనులు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఉటుకూరి అశోక్ మాట్లాడుతూ:”మన పూర్వీకులు మనకు అందించిన 700 ఏళ్ల నాటి చారిత్రక వారసత్వాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత.ఎంతో మహిమాన్వితమైన ఈ శివాలయం నిర్లక్ష్యానికి గురికావడం మనకు శ్రేయస్కరం కాదు.అందుకే గ్రామ పాలకవర్గం, పెద్దలు మరియు ప్రజల సహకారంతో ఈ మరమ్మతు పనులు చేపట్టాం.ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకువచ్చి, నిత్య పూజలు జరిగేలా చర్యలు తీసుకుంటాం.భవిష్యత్ తరాలకు మన సంస్కృతిని, సంప్రదాయాలను అందించడానికే ఈ ప్రయత్నం చేస్తున్నాం.ఈ పుణ్యకార్యంలో భాగస్వాములైన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పురోహితులు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.”ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉటుకూరి అశోక్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పురోహితులు ఆలయ పనులను పర్యవేక్షించారు.గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకులు, యువజన సంఘాల సభ్యులు హాజరయ్యారు.భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పనుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.ఆలయ గోపుర మరమ్మతులు, గర్భాలయ పునరుద్ధరణ, ప్రాకారాల నిర్మాణం చేపట్టనున్నారు.పరిసరాలను అందమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.ఈ పునరుద్ధరణ పనుల వల్ల శనిగరం గ్రామానికి ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది.ఆలయ పునరుద్ధరణకు చొరవ చూపిన సర్పంచ్ ఉటుకూరి అశోక్ బృందాన్ని అందరూ అభినందిస్తున్నారు.

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష

0

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష

మేడ్చల్, జూన్ 15: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 ఏళ్ల క్రితం నమోదైన బాలికపై అత్యాచార కేసులో నిందితుడికి ప్రత్యేక పోక్సో కోర్టు కఠిన శిక్ష విధించింది. కేసును సమగ్రంగా విచారించిన న్యాయస్థానం నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
అదేవిధంగా బాధితురాలికి రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. విచారణ సమయంలో సమర్పించిన సాక్ష్యాధారాలు, బాధితురాలి వాంగ్మూలం, దర్యాప్తు అధికారులు సమర్పించిన నివేదికలను పరిశీలించిన అనంతరం కోర్టు ఈ తీర్పును వెల్లడించింది.
బాలలపై లైంగిక నేరాలకు పాల్పడే వారిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని, బాధితులకు న్యాయం చేయడంలో పోక్సో చట్టం కీలక పాత్ర పోషిస్తోందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ తీర్పు బాలికలపై నేరాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరికగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

 

*ఉప సర్పంచ్ ల ఫోరం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్య క్షులుగా గనవేని నందిని మల్లేష్ యాదవ్ ఏక గ్రీవ ఎన్నిక*

0

*ఉప సర్పంచ్ ల ఫోరం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్య క్షులుగా గనవేని నందిని మల్లేష్ యాదవ్ ఏక గ్రీవ ఎన్నిక*

మెట్ పల్లి జూన్ 15: (పీపుల్స్ డైరీ)

హైదరాబాద్ లోని కంట్రీ క్లబ్ హాల్లో జరిగిన రాష్ట్ర ఉప సర్పంచ్ ల ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఉప సర్పంచ్ ల ఫోరం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామ ఉప సర్పంచ్ గనవేని నందిని మల్లేష్ యాదవ్ ని ఏక గ్రీవంగా ఎ న్నుకున్నట్లు ఉప సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ ప్రకటించారు.

వీరి నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని వీరిని జగిత్యాల జిల్లా, మ రియు కొమరం భీమ్ ఆసి ఫాబాద్ జిల్లాల ,ఇంచార్జి గా నియమించారు.ఈ సం దర్బంగా నూతనంగా ఎన్ని కైన ఉప సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు గన వే ని నందిని మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యా ప్తంగా ఉప సర్పంచ్ ల ఐక్య తకు హక్కుల సాధనకు కృ షి చేస్తానని అన్నారు.తన నియామకానికి సహకరిం చిన రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్ గారికి, రాష్ట్ర కార్యద ర్శి మెరుగు జంపన్న (జానీ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలోజగిత్యాల జి ల్లా కన్వీనర్ ముత్యాల స్వా మి, సంఘ తిరుపతి యాద వ్, ముత్యాల సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల సంక్షేమమే ఐజేయు ధ్యేయం*

0

*జర్నలిస్టుల సంక్షేమమే ఐజేయు ధ్యేయం*

•యూనియన్ సభ్యులం దరికీ ఇన్సూరెన్స్ పాలసీ

•టి యు డబ్ల్యూజే ఐజే యు అధ్యక్ష కార్య దర్శులు డా బూరం సంజీవ్ మహ మ్మద్ అజీమ్.

మెట్ పల్లి జూన్ 15:(పీపుల్స్ డైరీ)

టీయూడబ్ల్యూజే (ఐజే యూ) జర్నలిస్టుల సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తూ యూనియన్ సభ్యులందరి కీ ఇన్సూరెన్స్ పాలసీ చే యించమని టీ యు డబ్ల్యూ జే ఐజేయు మెట్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డా బూరం సంజీవ్, మహ మ్మద్ అజీమ్ అన్నారు. సో మవారం రోజున మెట్ పల్లి ప్రెస్ క్లబ్ జర్నలిస్టులందరికీ ఇన్సూరెన్స్ పాలసీ చేయిం చిన సందర్భంగా అధ్యక్ష కా ర్యదర్శులు డా బూరం సం జీవ్, మహమ్మద్ అజీమ్ లు మాట్లాడుతూ జర్నలి స్టుల వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా అనారోగ్యానికి గురవడమే కాకుండా కొం తమంది జర్నలిస్టులు మృ తి చెందిన సంఘటనలు కూడా ఇటీవల చోటు చేసు కున్నాయన్నారు. ఈ నేప థ్యంలో జర్నలిస్టులు, వారి కుటుంబాల కోసం ఆరోగ్య భీమా, జీవిత బీమా సౌక ర్యం కల్పించే అంశాన్ని ప్రథ మ ప్రాధాన్యతగా గుర్తించి ఆ దిశగా ఐజేయు సభ్యు లందరికీ ఇన్సూరెన్స్ పాల సీ చేయించమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపా ధ్యక్షులు జంగం విజయ్, అ ఫ్రోజ్, జిల్లా కార్యవర్గ సభ్యు లు సాజిద్ పాషా, బాసెట్టి హరీష్, గౌరవ సలహాదారు లు దాసం కిషన్, క్యాషియ ర్ మక్సూద్, జాయింట్ సెక్రె టరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, పింజర్ శివ, ఆర్గనైజింగ్ సె క్రెటరీ ఎండి సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు పొనగా ని మహేందర్, కుర్ర రాజేంద ర్,రఫీ ఉల్లా, సోహెల్, హై మద్, ముత్యాల రమేష్, బొల్లం రాజు, మాజీ అధ్య క్షుడు ఆగ సురేష్ సభ్యులు ఆదిల్ పాషా, రమణ, ఏస మేని గణేష్, శశి కుమారు, అమ్ముల ప్రవీణ్, తదితరు లు పాల్గొన్నారు.

ట్రాక్టర్‌పై నుంచి జారి మెకానిక్ మృతి

0

ట్రాక్టర్‌పై నుంచి జారి మెకానిక్ మృతి

– చికిత్స పొందుతూ ట్రాక్టర్ మెకానిక్ వెంకన్న మృతి

– గ్రామాన్ని కలిచివేసిన వెంకన్న మరణం

– అందరితో ఆప్యాయంగా మెలిగే వెంకన్న…

– గణపురంలో విషాదం…

 

గణపురం, జున్ 14 (పీపుల్స్ డైరీ): ట్రాక్టర్‌పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడిన ఓ మెకానిక్ తీవ్ర గాయాలతో నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూశాడు. ఈ విషాద ఘటన గణపురం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గణపురం మండల కేంద్రానికి చెందిన ఎర్రంరాజు వెంకటేశ్వర రాజు (వెంకన్న 54) ట్రాక్టర్ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 12న నగరంపల్లి – అప్పయ్యపల్లి గ్రామాల మధ్య నూతనంగా నిర్మించిన రహదారికి వాటర్ క్యూరింగ్ పనులు నిర్వహిస్తుండగా, తాను నడుపుతున్న ట్రాక్టర్‌పై నుంచి ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయాడు. దీంతో ట్రాక్టర్‌కు చెందిన భారీ వెనుక టైరు అతని శరీరంపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

 

– అందరితో ఆప్యాయంగా మెలిగే వెంకన్న…

 

గ్రామంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తిగా వెంకన్నకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ట్రాక్టర్ మెకానిక్‌ గా ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తూ రైతులు, వాహన యజమానులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు ముందుండి సహాయం చేసే స్వభావం కారణంగా గ్రామస్తుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. వెంకన్న మృతి వార్త తెలిసిన వెంటనే బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబ సభ్యులను ఓదారుస్తూ నివాళులర్పించారు. ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబంలోనే కాకుండా గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది.

కోట్లు పెట్టినా దొరకని నిజమైన సంతోషం..

0

ఉపాధి హామీ పనిలోనే వృద్ధ దంపతుల షష్ఠిపూర్తి..

రేగొండ లో గుండెల్ని హత్తుకుంటున్న వేడుక!

రేగొండ జూన్ 13 పీపుల్స్ డైరీ.. : నిజమైన సంతోషం కోట్లు ఖర్చు పెడితే రాదు.. ఆత్మీయుల మధ్య గడిపే ఆనంద క్షణాల్లోనే దొరుకుతుంది. నేటి సమాజంలో పెళ్లిళ్లు, వేడుకలు అంటేనే లక్షల రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేస్తూ ఆర్భాటంగా చేసుకునే రోజులివి.. అలాంటి రోజులలో సాధారణ కూలీ దంపతుల షష్టిపూర్తి వేడుక ఎలా ఉంటుంది.! వాళ్ళ కళ్ళలో నిజమైన ఆనందం…ఖరీదైన ఫంక్షన్ హాళ్లు, వందలాది బంధువుల కోలాహలం, రకరకాల విందు భోజనాలు ఉంటేనే పండుగ అనుకునే కాలంలో.. ఓ నిరుపేద జంట మాత్రం తమ నిరాడంబరతతో అందరికీ గొప్ప ఆదర్శంగా నిలిచింది.. డబ్బు కంటే మనుషుల మధ్య ఉండే ప్రేమానురాగాలే ఎంతో గొప్పవని నిరూపిస్తూ ఉపాధిహామీ పని ప్రదేశంలోనే తమ షష్టిపూర్తి (పెళ్లి )వేడుకను జరుపుకొని గుండెల్ని హత్తుకునేలా చేసింది. ఆడంబరాలకు ఏమాత్రం తావు లేకుండా జరిగిన ఈ వేడుక ఇప్పుడు ప్రతి ఒక్కరినీ లోతుగా ఆలోచింపజేస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేగొండ గ్రామ శివారులో ఈ వేడుక జరిగింది.. రేగొండ కు చెందిన వృద్ధ దంపతుల వివాహ బంధం విజయవంతంగా 60 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని, తోటి ఉపాధిహామీ కూలీలు పని ప్రదేశంలోనే వారికి ఘనంగా ‘షష్ఠిపూర్తి’(పెళ్లి వేడుక) నిర్వహించారు.​ఉపాధి పనులు ముగిసిన వెంటనే, సాంప్రదాయ పద్ధతిలో వృద్ధ దంపతులను దండలు మార్పించి మళ్లీ పెళ్లి వేడుక జరిపించారు. తోటి కూలీల చప్పట్లు, కేరింతల మధ్య నూతన వధూవరుల్లా మెరిసిన ఆ వృద్ధ దంపతులను స్థానిక యువకులు చాక్లెట్స్ పంచి అవే మిఠాయిలు, విందు భోజనంలా అభినందించారు.ఆ వృద్ధ దంపతుల వీడియో సామాజిక మధ్యమాల్లో ట్రోల్ అవుతుండగా వీడియోస్ చుసిన ప్రజలు సంతోషాన్ని వెక్తం చేస్తున్నారు.. ఆడుతూ పాడుతూ పని చేస్తే అలుపు సోలుపు ఏమి ఉండడంటూ నేటి యువతకు మంచి సందేశాన్ని అందిస్తున్నారు…

ఆర్టీసీ నర్సంపేట డిపో అభివృద్ధికి ఉద్యోగులందరూ సహకరించాలి

0

ఆర్టీసీ నర్సంపేట డిపో అభివృద్ధికి ఉద్యోగులందరూ సహకరించాలి

– నూతన డిపో మేనేజర్ సరస్వతి పిలుపు

నర్సంపేట: పీపుల్స్ డైరీ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపోలో నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన డిపో మేనేజర్ సరస్వతి డిపో ఆవరణలో ఉద్యోగులతో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో అభివృద్ధి, సేవల మెరుగుదలపై ఉద్యోగులకు పలు కీలక సూచనలు చేశారు.నర్సంపేట డిపో అభివృద్ధి చెందాలన్నా, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందాలన్నా ప్రతి ఉద్యోగి పూర్తి బాధ్యతతో పనిచేయాలని డీఎం కోరారు.డిపో ఆర్థిక పురోగతికి, ఆదాయాన్ని పెంపొందించేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఉద్యోగులందరి సహకారంతోనే డిపోను అగ్రపథంలో నిలపడం సాధ్యమవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

🥛 ఉద్యోగుల సంక్షేమం – మజ్జిగ పంపిణీ

ప్రస్తుత వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని, ఉద్యోగుల ఆరోగ్యం కొరకు డిపో యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. గేట్ మీటింగ్ అనంతరం సిబ్బంది అందరికీ మజ్జిగ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ అమృత మరియు డిపో ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మేడ్చల్‌లో వీధి కుక్కల బెడద..*

0

*మేడ్చల్‌లో వీధి కుక్కల బెడద..*

*చిన్నారుల భద్రతపై ఆందోళన
కుక్క దాడిలో ఆరేళ్ల చిన్నారికి గాయాలు*

*జీహెచ్‌ఎంసీ చర్యలపై ప్రశ్నలు*

మేడ్చల్, జూన్ 12 మేడ్చల్ పట్టణంలో వీధి కుక్కల సమస్య మరోసారి చర్చనీయాంశంగా మారింది. బాలాజీ నగర్ రోడ్డు నెం.8లో ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారి అక్షరపై వీధి కుక్క దాడి చేయడం స్థానికులను కలవరపరిచింది. ఈ ఘటనలో చిన్నారితో పాటు మరో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. దీంతో ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెరుగుతున్న వీధి కుక్కల సమస్య
మేడ్చల్ పట్టణంలోని అనేక కాలనీల్లో వీధి కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు చిన్నారులు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని పేర్కొంటున్నారు. భయాందోళనలో తల్లిదండ్రులు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కుక్కల దాడుల ఘటనలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో, మేడ్చల్‌లో జరిగిన ఈ సంఘటన తల్లిదండ్రుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. పిల్లలను బయటకు పంపాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు
వీధి కుక్కల నియంత్రణ కోసం జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. కుక్కలకు స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. అధికారుల స్పందన అవసరం
ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ వీధి కుక్కల సమస్యపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర కార్యాచరణ రూపొందించాలని కోరుతున్నారు. వీధి కుక్కల బెడదపై అధికారులు ఎంత త్వరగా స్పందిస్తారో, మేడ్చల్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

భద్రతకు ప్రాధాన్యమిస్తూ లక్ష్యాలు సాధించాలి

0

భద్రతకు ప్రాధాన్యమిస్తూ లక్ష్యాలు సాధించాలి

– భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి

– ఉత్పాదకత పెంపునకు నూతన క్రేన్

– కేటీకే ఓసీ-3లో 12 టన్నుల ఏస్ క్రేన్ ప్రారంభం

గణపురం, జూన్ 11 (పీపుల్స్ డైరీ):

 

గణపురం మండలంలోని కేటీకే ఓసీ-3 ప్రాజెక్టులో గనుల కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన 12 టన్నుల సామర్థ్యంగల ఏస్ కంపెనీ క్రేన్‌ను జనరల్ మేనేజర్ ఎ. రాజేశ్వర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. గనుల్లో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుతో పాటు యంత్రాల నిర్వహణ పనులను వేగవంతం చేయాలనే లక్ష్యంతో ఈ క్రేన్‌ను వినియోగంలోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జీఎం రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూనే నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను సాధించే దిశగా అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రాజెక్టు అభివృద్ధికి అవసరమైన పలు సూచనలు చేస్తూ, గనుల నిర్వహణలో ఆధునిక యంత్రాల వినియోగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. నూతన క్రేన్ అందుబాటులోకి రావడంతో ప్రాజెక్టు కార్యనిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడి, ఉత్పాదకత లక్ష్యాల సాధనకు తోడ్పాటునందిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఏరియా ఇంజనీర్ వి. రాజారావు, ప్రాజెక్టు ఆఫీసర్ బిక్ష్మమయ్య, ప్రాజెక్టు మేనేజర్ రాంబాబు, ఓసీ ఆపరేషన్స్ మేనేజర్ సంపత్, ప్రాజెక్టు ఇంజనీర్ బి. శ్రీనివాస్ కుమార్‌తో పాటు అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, పిట్ సెక్రటరీలు, ఉద్యోగులు పాల్గొన్నారు.

 

error: Content is protected !!